భారతదేశం, ఫిబ్రవరి 18 -- రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడత కింద రైతు ఖాతాలో రూ. 2 వేలు జమ చేస్తుంది.
పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల చివర్లో ఈ నిధులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 19వ విడతను విడుదల చేశారు. 2024లో.. 16వ విడత మొత్తం ఫిబ్రవరి 28న జమ చేయబడింది. 2023లో 13వ విడతను ఫిబ్రవరి 27న పూర్తి చేశారు.
ఈ తేదీల ఆధారంగా చూస్తే. ఈ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసే సూచనలున్నాయి. ఫిబ్రవరి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.