భారతదేశం, ఫిబ్రవరి 18 -- రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడత కింద రైతు ఖాతాలో రూ. 2 వేలు జమ చేస్తుంది.

పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల చివర్లో ఈ నిధులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 19వ విడతను విడుదల చేశారు. 2024లో.. 16వ విడత మొత్తం ఫిబ్రవరి 28న జమ చేయబడింది. 2023లో 13వ విడతను ఫిబ్రవరి 27న పూర్తి చేశారు.

ఈ తేదీల ఆధారంగా చూస్తే. ఈ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసే సూచనలున్నాయి. ఫిబ్రవరి ...