తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 21 -- Phone Tapping Case Latest Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ఏ4 నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టాస్క్ఫోర్స్ రిటైర్డ్ డిసిపి రాదాకిషన్ రావు(Radhakishan Rao) ను కట్టుదిట్టమైన భద్రత మద్య కరీంనగర్ కు తరలించారు. పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న రాధాకిషన్ తల్లి సరోజినీ దేవి(98)ని చూసేందుకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో భారీ బందోబస్తు మధ్య చంచల్ గూడ జైల్ నుంచి కరీంనగర్ లోని సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కోర్టు అనుమతితో తల్లిని పరామర్శించిన రాదాకిషన్ రావు కుటుంబ సభ్యులను కలిసి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సోదరి సంరక్షణలో ఉన్న తల్లిని చూసి భావోద...