భారతదేశం, ఫిబ్రవరి 23 -- పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి, 'బెంగాల్​ చాణిక్యుడు'గా పేరొందిన ముకుల్ రాయ్ (71) సోమవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున కోల్‌కతాలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, స్థానిక మీడియా కథనాల ప్రకారం, రాయ్ తీవ్రమైన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

సాల్ట్ లేక్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు శుభ్రాంగ్షు రాయ్ ధృవీకరించారు.

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తగా పేరుగాంచిన ముకుల్ రాయ్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

కాగా గత కొన్ని ఏళ్లుగా ముకుల్ రాయ్ తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2023 ప్రారంభంలో ఆయనక...