Hyderabad, ఫిబ్రవరి 28 -- MM Keeravani Concert: ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి.. ఈ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో మనకు తెలుసు. ఏకంగా ఆస్కార్ నే గెలుచుకొచ్చిన జోడీ వీళ్లది. ఇప్పుడు కీరవాణి తన 'నా టూర్ ఎంఎంకే' కాన్సర్ట్ కు సిద్ధమవుతున్న వేళ ఈ జోడీ సినిమాల్లో క్రియేట్ చేసిన మ్యాజిక్ ను లైవ్ లో వినడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సమయంలో రాజమౌళి తనకు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్స్ కూడా కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

ఎంఎం కీరవాణి కాన్సర్ట్ హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చి 22న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 28) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఈ కాన్సర్ట్ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అయితే ఇందులో పాటలతోపాటు ఒరిజనల్ సౌండ్‌ట్రాక్స్ కూడా ఉండాల్సిందే అంటూ తన ...