భారతదేశం, ఫిబ్రవరి 9 -- భారత ఆటోమొబైల్ రంగంలో భారీ ఎస్‌యూవీల మధ్య యుద్ధం మొదలుకానుంది! జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ 'ఎంజీ మెజెస్టర్'ను ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ చేస్తోంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిస్తూ, మార్కెట్‌లో తన పట్టును పెంచుకోవడానికి ఎంజీ ఈ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తొలిసారిగా కనిపించిన ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌తో రోడ్లపైకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్​యూవీకి సంబంధించిన మరో టీజర్​ని సంస్థ ఇటీవలే విడుదల చేసింది. అందులోని హైలైట్స్​ని ఇక్కడ చూసేయండి..

ఎంజీ మెజెస్టర్ కేవలం ఒక ఎస్​యూవీ మాత్రమే కాదు! రోడ్డుపై వెళుతుంటే ఒక రాజసం ఉట్టిపడేలా ఉంటుంది దీని డిజైన్.

ముందు భాగం: భారీ మ్యాట్రిక్స్ గ్రిల్, గద్ద రెక్కలను పోలి ఉండే డ...