భారతదేశం, ఫిబ్రవరి 8 -- విదేశీ ఉపాధి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉండటంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) డేటా ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య ఆంధ్రప్రదేశ్ నుండి 76,201 మంది కార్మికులు ఈ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా వలస అనుమతులు పొందారు. కార్మిక వలసలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఈ ఐదేళ్ల కాలంలో వలసలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దీనికి మహమ్మారి కరోనాతోపాటుగా మరికొన్ని కారణాలు ఉన్నాయి. 2021లో వలసలు చూసుకుంటే.. అత్యల్ప గణాంకాలు ఉన్నాయి. 998 మంది మహిళలు సహా 5,482 మంది కార్మికులు విదేశాలకు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య బాగా పెరిగిందనే చెప్పవచ్చు. 4,704 మంది మహిళలు సహా 19,347 మందికి క్లియరెన్స్‌లు వచ్చాయి. 2023లో 16,387 మంది కార్మికులు వలస వెళ్లగా,...