భారతదేశం, ఫిబ్రవరి 14 -- Maha Kumbh 2025 record: మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణి సంగమంలో ఇప్పటివరకు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లు దాటింది. ఈ సంఖ్య దాదాపు చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ. యూపీ ప్రభుత్వం ఈ వివరాలను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే 1 కోటి మందికి పైగా పవిత్ర స్నానాలను ఆచరించారని తెలిపింది. మొత్తంగా, శుక్రవారం, ఫిబ్రవరి 14 సాయంత్రం వరకు మహా కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదు.
మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ప్రస్తుత సంఖ్య అన్ని అంచనాలను మించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.