భారతదేశం, ఫిబ్రవరి 14 -- హైదరాబాద్‌లోని ఉప్పల్ లో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నంబర్ 1, నంబర్ 2 నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పార్ట్ టైమ్ ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థి విద్యా అర్హతలతో పాటు పని చేసిన అనుభవాన్ని పరగణనలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

రామాంతపూర్ రోడ్డ వైపు ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వేదికగా టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిల్లో ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్) ఉన్నాయి. తెలుగు టీచర్ (రీజినల్ లాంగ్వేజ్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, ...