తెలంగాణ,కరీంనగర్, ఏప్రిల్ 26 -- Karimnagar District Crime News : కన్నకొడుకునే కడతేర్చాడు తండ్రీ.‌ కళ్ళకు కారం పెట్టి...రోకలి తో తలపై కొట్టి ప్రాణం తీశాడు.‌ఈ దారుణ ఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగింది.‌ చింతకుంట గ్రామానికి చెందిన పెరుమళ్ళ రాజకుమార్ (20) హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. సెలవులపై ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ ను కన్నతండ్రి పెరుమండ్ల శ్రీనివాస్ (50) దారుణంగా హత్య చేశాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కొడుకుపై దాడి చేశాడు. తల్లి ఉపాధి హామి కూలీ పనికి వెళ్ళగా ఉదయం పది అయినా కొడుకు నిద్ర లేకపోవడంతో ఆగ్రహంతో తండ్రీ కళ్ళల్లో కారంపొడి చల్లి, రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో బెడ్ పైనే కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కోపంతో కొడుకును చంపిన తండ్రీ నేరుగా కొత్తపల్...