భారతదేశం, ఫిబ్రవరి 16 -- చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై మరోసారి ఇండియాకు తిరుగులేదని భారత క్రికెట్ వీరులు చాటారు. టీ20 ప్రపంచకప్ లో ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఇండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా పాక్ సరెండర్ అయిపోయింది. తమ టీమ్ ఆట పట్ల పాకిస్థాన్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. టీవీలు పగలగొడుతున్నారు. సెన్స్ మరిచి ప్రవర్తిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ను ఇండియా చిత్తుచేసింది. 61 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ ఘోర పరాజయంతో తీవ్ర నిరాశకు గురైన ఒక పాకిస్థానీ అభిమాని తన టీవీ సెట్‌ను పగలగొట్టాడు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలో తన జట్టు ఓటమికి కోపంతో క్రికెట్ బ్యాట్‌తో టీవీని ఓ ఫ్యాన్ పగలగొట్టాడు. ఫేస్ బుక్ లో వఖార్ అజమ్ అనే అకౌంట్లో ఈ వీడియో అప్ లోడ్ చేశాడు.

''భారత్ మళ్ళ...