భారతదేశం, ఫిబ్రవరి 23 -- దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 87,770గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,77,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,777గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 80,450గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 8,04,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 8,045గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,920గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్...