భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలపై జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఎలాగైనా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రచారంతో హీటెక్కించారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయి.

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.

68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-...