భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, సాధారణ పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) కార్ల కంటే వాటి ధరలు ఎక్కువగా ఉండటం చాలామందిని వెనకడుగు వేయించేలా చేస్తోంది. ఈ ధర పెరగడానికి ప్రధాన కారణం అందులో వాడే భారీ బ్యాటరీ ప్యాక్. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్​) అనే సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అసలేంటి ఈ బీఏఏఎస్​ స్కీమ్​? ఇండియాలో ఈ స్కీమ్​ ద్వారా అందుబాటులో ఉన్న ఈవీలు ఏవి? ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఈ బీఏఏఎస్​ విధానంలో మీరు ఎలక్ట్రిక్​ కారును కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు ధరను మాత్రమే చెల్లించి, బ్యాటరీకి నెలవారీగా లేదా కిలోమీటరుకు కొంత చొప్పున 'రెంటల్' (సబ్‌స్క్రిప్షన్) చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర ...