భారతదేశం, నవంబర్ 11 -- సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో ఓ కారు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. 24మంది గాయపడ్డారు. ఈ ఘటనతో దిల్లీ పోలీసులు అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అయితే, ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు.. బాంబు పేలుడేనా? ఇందులో ఉగ్ర కోణం ఉందా? అనే విషయంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ ఈ ఘటనపై యూఏపీఏ కింద కేసు నమోదు చేయడంతో, దిల్లీ పోలీసులు ఉగ్ర కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టమైంది.
వాహనాలకు నష్టం: పేలుడు సంభవించిన తర్వాత, మరో మూడు నుంచి నాలుగు వాహనాలకు కూడా మంటలు అంటుకుని, వాటికి తీవ్ర నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.
క్షతగాత్రులకు చికిత్స: గాయపడిన వారిని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.