భారతదేశం, ఏప్రిల్ 26 -- Dear OTT: జీవీ ప్ర‌కాష్ కుమార్‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా న‌టించిన డియ‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డియ‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఏప్రిల్ 11న డియ‌ర్ మూవీ థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. గుర‌క స‌మ‌స్య ప్ర‌ధానంగా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్ డియ‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. యూనిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న ఆ స‌మ‌స్య‌ను అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది. థియేట‌ర్ రిజ‌ల్ట్ కార‌ణంగానే ఈ మూవీని రెండు వారాల గ‌డువులోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలుగులోనూ ...