భారతదేశం, అక్టోబర్ 5 -- భారీ వర్షాలకు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతం అతలాకుతలమైంది. వర్షాల కారణంగా ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అంతేకాకుండా, అధిక వర్షపాతం కారణంగా ఒక ఇనుప వంతెన కూడా కూలిపోయింది.
దుధియా వద్ద బాలసన్ నదిపై ఉన్న ధుదియా వంతెన భారీ వర్షాల ధాటికి దెబ్బతిని కూలిపోయింది. ఈ వంతెన సిలిగురి, మిరిక్లను కలుపుతూ కీలక మార్గంగా ఉంది.
డార్జిలింగ్ లోక్సభ సభ్యుడు అయిన బీజేపీ నాయకుడు రాజు బిస్తా మాట్లాడుతూ.. భారీ వర్షపాతం కారణంగా చాలా మంది మరణించారని, ఆస్తుల నష్టం కూడా భారీగా జరిగిందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖచ్చితమైన సంఖ్యను ఇంకా వెల్లడించనప్పటికీ, కొండచరియలు విరిగిపడటం వల్ల మిరిక్లో కనీసం నలుగురు మరణించి ఉండవచ్చని అధికారులు హెచ్టీ వార్తా సంస్థకు తెలిపారు.
"డార్జిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.