భారతదేశం, ఏప్రిల్ 8 -- ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల పాటు తనపై 23మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 19ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్​ చేశారు.

కంటోన్మెంట్ అదనపు పోలీసు కమిషనర్ విదుష్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. మార్చ్​ 29న బాధితురాలు కొందరు యువకులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఏప్రిల్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆమెను వెతికి రక్షించారు. కానీ ఆ సమయంలో అత్యాచారం గురించి ఆమె ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు.

అయితే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఏప్రిల్ 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మార్చ్​ 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిందితులు తనను పలు హోట...