భారతదేశం, ఫిబ్రవరి 16 -- 10వ తరగతి విద్యార్థులు మొదటి బోర్డు పరీక్ష రాయడం తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్‌లో కనీసం మూడు సబ్జెక్టులకు ప్రయత్నించని వారిని 'ఎసెన్షియల్ రిపీట్' కేటగిరీలో ఉంచుతామని సీబీఎస్ఈ పేర్కొంది.

సీబీఎస్ఈ 2026 నుండి 10వ తరగతికి రెండు బోర్డు పరీక్షలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 10వ తరగతి విద్యార్థులు మొదటి బోర్డు పరీక్ష రాయలేరని, అందువల్ల వారిని రెండో బోర్డు పరీక్ష రాయడానికి అనుమతించాలని కొన్ని అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది బోర్డు.

'అందరు విద్యార్థులు మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి. ఉత్తీర్ణులైన, అర్హత కలిగిన విద్యార్థులందరూ సైన్స్, గణితం, సోషల్, లాంగ్వేజస్‌ మూడు సబ్జెక్టులలో దేనిలోనైనా తమ మార్కులను మెరుగుపరచుకో...