భారతదేశం, ఫిబ్రవరి 10 -- సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ 2026 విద్యా సంవత్సరం నుంచే 12వ తరగతి బోర్డు పరీక్షల పేపర్లను ఆన్‌లైన్ విధానంలో (ఆన్​-స్క్రీన్​ మార్కింగ్​) దిద్దనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే (భౌతికంగా) మూల్యాంకనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ పద్ధతిలో విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మారుస్తారు. ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే ఆ పత్రాలను చూస్తూ మార్కులు వేస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..

తప్పులకు తావుండదు: మార్కుల లెక్కింపులో (టోటలింగ్​) మనుషుల వల్ల జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయి.

వేగవంతమైన ఫలి...