తెలంగాణ,భదాద్రి జిల్లా, ఏప్రిల్ 13 -- Bhadradri Kothagudem District : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యం గంజాయి(Cannabis) గుప్పుమంటూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఈ జిల్లా మీదుగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇలా పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న రూ.9 కోట్ల పైచిలుకు విలువ చేసే గంజాయిని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో శనివారం దగ్ధం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri)జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదైన 55 కేసుల్లో నిందితుల వద్ద నుంచి సీజ్ చేసిన 3,723 కేజీల నిషేధిత గంజాయిని హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. దహనం చేసిన నిషేధిత గంజాయి ...