భారతదేశం, జనవరి 30 -- Andhra Loyola Dispute: విజయవాడలో లయోలా గ్రౌండ్స్లో వాకింగ్ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్ చేయడానికి అనుమతి కోసం వాకర్ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. నగరం మధ్యలో ఉన్న ఈ కాలేజీ దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
1950వ దశకంలో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించే సమయంలో లయోలా కాలేజీకి అంకురార్పణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన ఈ విద్య సంస్థ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమ కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. క్యాథలిక్ మైనార్టీ విద్యా సంస్థగా.. జెస్యూట్ మిషనరీల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న లయోలా అనుబంధ సంస్థల్లో ఆంధ్రా లయోలా కాలేజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.