భారతదేశం, ఫిబ్రవరి 16 -- అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల ఓటీటీలో రిలీజైన 'చీకటిలో' అనే సైకో క్రైమ్ థ్రిల్లర్ తో మళ్లీ తెలుగులోకి తిరిగొచ్చింది. వివిధ భాషల సినిమాల్లో నటించిన ఆమె సినిమా రంగంలో పీఆర్ కల్చర్, పబ్లిసిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

శోభితా ధూళిపాళ తన కెరీర్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించారు. ఇటీవల 'చీకటిలో' ఓటీటీ మూవీతో ఆమె తెలుగు సినిమాకు తిరిగి వచ్చారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో తన సినిమాల సెలక్షన్ పై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చీకటిలో సినిమా కోసం సైన్ చేసేముందు ఆమె ఏ విషయాలను ఆలోచించిందోనని చెప్పుకొచ్చింది.

"నేను ఈ (చీకటిలో) ప్రాజెక్టుకు ఓకే చెప్పినప్పుడు అంత డీప్ గా ఆలోచించలేదు. ఒక ఆడియన్ గా తెలుగు సినిమాతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక ఆర్టిస్ట్ గానూ ఉంది. నేను యాక్టింగ్ ప్రారంభించినప్పుడు...