భారతదేశం, ఫిబ్రవరి 17 -- ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడిపోతున్నాయి. హిందూ మతంలో ఈ గ్రహణాలను అశుభంగా భావిస్తారు. అయితే, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయరు. భోజనం తినడం వంటివి కూడా నిషిద్ధం. గ్రహణాల సమయంలో ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయని, మంచిది కాదని అంటారు.

గ్రహణ సమయంలో ధ్యానం చేయడం, భగవంతుని భక్తి పాటలు పాడుకోవడం, మంత్రాలను చదువుకోవడం వంటివి చేయొచ్చు. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చాలా మంది గ్రహణ సమయంలో చదువుతూ ఉంటారు. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది.

2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న, అనగా ఈరోజు, మాఘ అమావాస్య రోజున ఏర్పడుతోంది. ఈ గ్రహణం మధ్...