భారతదేశం, ఫిబ్రవరి 11 -- హైదరాబాద్‌లో భూకబ్జాలు చేసేవారికి చుక్కలు చూపిస్తోంది. హైడ్రా ఇప్పటికే కొన్ని కోట్ల విలువైన భూమిని ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా రూ.1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో పార్కును 150 గ‌జాల మేర క‌బ్జా చేశాడు ఓ వ్యక్థి. ఏకంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవాల‌నుకున్నాడు.

అలాగే హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లోని ఖానామెట్ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు. 5 ఎక‌రాల‌ను వెల‌మ సంఘానికి గ‌తంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.. ఆ కేటాయింపుల‌పై కొంత‌మంది అభ్యంత‌రం చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆక్రమ‌ణ‌ల చేశారు కొందరు క‌బ్జారాయుళ్లు. ఈ రెండు క‌బ్జాల‌పై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌క...