భారతదేశం, ఫిబ్రవరి 19 -- అఫ్గానిస్థాన్​ని తాలిబన్లు తమ వశం చేసుకున్నప్పటి నుంచి మహిళలు, మహిళా భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వీటిని మరో స్థాయికి తీసుకుళుతూ.. తాలిబన్లు తాజాగా ఒక పని చేశారు. గృహహింసకు చట్టబద్ధత కల్పించేశారు! తాలిబన్ల అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించిన కొత్త శిక్షాస్మృతి మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అధికారికంగా 'చట్టబద్ధత' కల్పించేలా ఉంది. భార్యను ఎముకలు విరగకుండా కొడితే, అది గృహహింస కాదని ఇప్పుడు తాలిబన్లు చెబుతున్నారు.

గృహహింసను అరికట్టాల్సిన చట్టాలే, ఇప్పుడు హింసను ప్రోత్సహించేలా ఉండటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

కొత్త నిబంధనల ప్రకారం.. భర్త తన భార్యను లేదా పిల్లలను శారీరకంగా శిక్షించవచ్చు. అయితే, ఆ దాడిలో "ఎముకలు విరగకూడదు లేదా బహిరంగ గాయాలు కాకూడదు" అనే షరతు పెట్టారు. ఒకవేళ భ...