భారతదేశం, మే 3 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వస్తున్న అన్ని వస్తువులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. ఈ విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విదేశీ వాణిజ్య విధానం (ఏఫ్​పీటీ) 2023 ను సవరించి పాకిస్థాన్​కి చెందిన ఎలాంటి వస్తువులనైనా దిగుమతి లేదా రవాణాను "తదుపరి ఆదేశాలు వచ్చే వరకు" నిషేధించే నిబంధనను చేర్చింది.

జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని అమలు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) తెలిపింది.

"విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్​టీపీ)లో "పాకిస్థాన్ నుంచి దిగుమతులపై నిషేధం" అనే శీర్షిక కింద ఒక కొత్త నిబంధనను అధికారికంగా భారత ప్రభుత్వం చేర్చింది. పాకిస్థాన నుంచి ఉద్భవించే లేదా ఎగుమతి చేసే అన్ని వస్తువుల ది...