Telangana, జూన్ 29 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్, సెకండ్ ఫేజ్ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా థర్డ్ ఫేజ్ సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ విడత కింద మొత్తం 85,680 మంది సీట్లు పొందారు.

థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవాలి. జులై 1లోపు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోకపోతే మీకు కేటాయించిన సీటు రద్దవుతుంది.

దోస్త్ థర్డ్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపో...