భారతదేశం, మే 6 -- హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణపై భజరంగ్‌దళ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోవైపు భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అండగా ఉండాల్సిన వేళ అందాల పోటీలు అవసరమా' అని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు ప్రశ్నించారు. దేశ భద్రత కంటే పోటీల నిర్వహణే ముఖ్యమైందా అని వ్యాఖ్యానించారు.

మిస్ వరల్డ్ పోటీలు మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవంతో మొదలవుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 116 దేశాల నుండి వచ్చిన అందాల పోటీదారులు ఈ వేడుకలో పాల్గొంటారు. మే 31న ఫైనల్ ఉంటుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా.. విజేతకు కిరీటం బహూకరిస్తారు.

మే 10: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవం.

మే 12: చార్మినార్, లాడ్ బజార్‌లో హ...