భారతదేశం, మే 31 -- కొంత‌గ్యాప్ త‌ర్వాత య‌మ‌లోకం కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో ఓ మూవీ రాబోతుంది. య‌ముడు టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జ‌గ‌దీష్ ఆమంచి హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కూడా అత‌డే. శ్రావ‌ణి శెట్టి హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

య‌ముడు మూవీ టీజ‌ర్‌ను హీరో న‌వీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో వ‌రుస‌గా అమ్మాయిలు మిస్స‌వుతుంటారు. నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఆ మిస్సింగ్ అమ్మాయిల హ‌త్య‌కు లింక్ ఉన్న‌ట్లుగా స‌స్సెన్స్ రేకెత్తిస్తూ ఈ టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. యముడు భూలోకంలోకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్క‌డే విధిస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది టీజ‌ర్‌లో ఇంట్రెస్టింగ్‌ను పంచుతోంది.

టీజ‌ర్‌లోని 'ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం' అన...