భారతదేశం, ఫిబ్రవరి 17 -- టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒక దశాబ్దానికి పైగా తనదైన నటనతో అలరించిన బ్యూటిపుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. అనంతరం 2019లో 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రంతో హిందీ తెరకు పరిచయమయ్యారు రెజీనా కసాండ్రా.

చెన్నైకి చెందిన ఈ హీరోయిన్ షూటింగ్ సెట్‌ను తన సొంత ఇల్లుగా భావిస్తారట. అయితే, ఒక దక్షిణాది నటిగా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం తనకు అంత సులభం కాలేదని, హిందీ చిత్రసీమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా రెజీనా కసాండ్రా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.

బాలీవుడ్ పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా కసాండ్రా మనసు విప్పారు. "నేను ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్‌ని కాబట్టి నన్ను ఒక మూసలో (Stereotype) బంధించారు" అని రెజీనా కసాండ్రా తెలిపారు.

"నిజానికి చాలామంది దక్షిణాది వారితో పోలిస్...