భారతదేశం, జూన్ 7 -- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురికావడంతో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు పర్యటన నిమిత్తం సిమ్లాలో ఉన్న సోనియా గాంధీ చారాబ్రాలోని ప్రియాంక గాంధీ నివాసంలో ఉంటున్నారు. జూన్ 7వ తేదీ ఆదివారం ఆమె తిరిగి ఢిల్లీకి తిరిగి రానున్నారు.

శనివారం ఉదయం సమయంలో స్వల్ప అస్వస్థతకు గురైన సోనియాగాంధీని వెంటనే సిమ్లాలోని ఆస్పత్రికి తరలించారు. స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీని చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఐజిఎంసిలోని ఒక సీనియర్ వైద్యుడు ధృవీకరించారు. ''ఆమె రక్తపోటు కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ ఆమె స్థిరం...