భారతదేశం, నవంబర్ 27 -- రాచకొండ పోలీసులు కమిషనరేట్లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నేరాలు వదిలి జనంలో ఉంటున్న వారిని సమాజ సేవలో పాల్గొనడానికి, వారిని చూసి ఎవరూ భయపడకుండా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. స్థిరమైన సానుకూల ప్రవర్తన, మార్పు, సంస్కరణలను అంగీకరించడానికి సుముఖత చూపిన హిస్టరీ-షీటర్లను గుర్తించి రద్దీగా ఉండే ట్రాఫిక్ పాయింట్ల వద్ద నియమించారు.
ఉప్పల్, ఎల్బీ నగర్, ECIL వంటి ప్రధాన జంక్షన్లలో హిస్టరీ షీటర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి పనిచేశారు. వాహనాల కదలికను నిర్వహించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డారు. ఈ కార్యక్రమంపై కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం అర్థవంతమైన మార్పును సృష్టించడం, ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.