భారతదేశం, జనవరి 12 -- అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ) ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ఆదివారం నాడు గ్రామంలో పురుషులు ప్రత్యేకంగా మగవారి పొంగళ్లు పండుగను జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ రోజున ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి తిరిగి వచ్చిన పురుషులు తమ ఇళ్ల నుండి వంట సామాగ్రిని తెచ్చి, ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు తయారు చేసి, సంజీవరాయలకు నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామస్తులు ఈ ప్రాంతంలో ఈ ఆచారాన్ని సంక్రాంతి కంటే చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి లేదా దేవతకు సమర్పించిన పొంగళ్లను తినడానికి అనుమతి లేదు, ప్రాంగణం వెలుపల నుండి మహిళలు దర్శనం చేసుకోవచ్చు. తిప్పాయపల్లె సంజీవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.