భారతదేశం, జూలై 13 -- తమిళ హీరో ఆర్య, డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) అత్యంత ప్రమాదకరమైన కారును తిప్పే స్టంట్ చేస్తున్న సమయంలో స్టంట్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. రాజు మరణించారు. ఈ మరణంపై తమిళ హీరో విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాల్, గతంలో రాజుతో అనేక చిత్రాల్లో పనిచేశారు.
సోషల్ మీడియాలో విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ లో విశాల్ పోస్టు పెట్టారు. "జామి (ఆర్య), పా.రంజిత్ చిత్రంలో కారును తిప్పే సన్నివేశం చేస్తున్న సమయంలో స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించడం నమ్మశక్యంగా లేదు. నాకు రాజు చాలా ఏళ్లుగా తెలుసు. నా చిత్రాల్లో అనేక ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు. అతను చాలా ధైర్యవంతుడు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నా" అని విశాల్ పేర్కొన్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.