భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు ముందు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ కాపీలను విజయవాడ కనక దుర్గమ్మ దేవత ముందు ఉంచారు. వేద పండితులు శ్రేయస్సు, ప్రజా ప్రయోజనం కోసం ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.

ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్, కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, డిప్యూటీ సెక్రటరీ సూరజ్ గనోర్, ఇతరులతో కలిసి దుర్గా ఆలయంలో పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం అధికారులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నివాసానికి వెళ్లి బడ్జెట్ కాపీలను అందజేశారు. తరువాత ఆయన వాటిని దేవత ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత మంత్రి పయ్యావుల వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ...