భారతదేశం, ఫిబ్రవరి 10 -- సొంత చెల్లినే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి.. ఆమెను బెదిరిస్తూ.. ఈ దారుణాలు చేశాడు. అంతేకాదు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ కేసులో విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దోషిగా తేలిన యువకుడికి చనిపోయేంతవరకు జైలుశిక్షని విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల తరువాత తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి తన కుమార్తెలతో పమిడిముక్కల మండలం మంటాడలో నివసిస్తోంది. తండ్రి తన 21 ఏళ్ల కొడుకుతో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో స్థిరపడ్డాడు.

2023లో నిందితుడు తన తల్లి, చెల్లెళ్లను కలిసేందుకు మంటాడకు వచ్చ...