భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​! ఎలక్ట్రిక్​ వాహన తయారీదారుకు చెందిన ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ సోమవారం ఓపెన్​ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ వివరాలు, జీఎంపీ, ఈ ఐపీఓకి సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చా? లేదా? అన్న నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..

రెండు నెలల తర్వాత ప్రైమరీ మార్కెట్​ మెయిన్ బోర్డ్ సెగ్మెంట్​లో వస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ ఏథర్​ ఎనర్జీ. ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ఏప్రిల్ 28, సోమవారం ఓపెన్​ అయ్యి ఏప్రిల్ 30 బుధవారం నాడు ముగుస్తుంది.

ఏథర్ ఎనర్జీ అనేది ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన తయారీదారు. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యు) నిర్మిస్తుంది. సొంతంగా సాఫ్ట్​వేర్​, ఛార్జింగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ యాక్ససరీలు ఈ సంస్థకు ఉన్నాయి ఇవన్నీ భారతదేశంలో తయారై, అభివృద్ధి అవ...