భారతదేశం, ఫిబ్రవరి 6 -- ప్రకాష్ రాజ్ మరోసారి చెలరేగిపోయాడు. రెహమాన్ కు మద్దతుగా మాట్లాడుతూ తనకు అస్సలు నచ్చని వారిపై ప్రతాపం చూపించాడు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 'క్రిమినలైజింగ్ డిసెంట్' (వ్యతిరేకతను నేరంగా పరిగణించడం) అనే అంశంపై మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, దానిపై వచ్చిన విమర్శలను అతడు చెప్పుకొచ్చాడు.

రెహమాన్ వివాదంపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ఏఆర్ రెహమాన్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. 'మా తుజే సలాం', 'జై హో' అంటూ దేశభక్తిని చాటారు. రెండు ఆస్కార్ అవార్డులు తెచ్చినప్పుడు మీరంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక నిజం చెప్పారు. గుర్తుంచుకోండి.. మీ దగ్గర పని కోసం ఆయన అడుక్కోవడం లేదు, ఆయన స్థాయి అది కాదు" అని ప్రకాష్ రాజ...