భారతదేశం, మే 24 -- మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ మ‌ధుర మ‌నోహ‌ర మోహం స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి రావడం గ‌మ‌నార్హం.

మ‌ధుర మ‌నోహ‌ర మోహం మూవీలో ష‌రాఫ్ ఉద్దీన్‌, ర‌జీషా విజ‌య‌న్, బిందు ప‌ణిక్క‌ర్‌, సైజు కురుప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. స్టెఫీ జేవియ‌ర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ధుర మ‌నోహ‌ర మోహం మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదు కోట్ల లిమిటెడ్ బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ ప‌ది కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ష‌రాఫ్ ఉద్దీన్‌, ర‌జీషా విజ‌య‌న్ యాక్టింగ్‌తో పాటు టెక్నిక‌ల్‌గా బెస్ట్ మూవీ అంటూ ప్ర‌శంస‌లు వినిపించాయి. కుల‌, మ‌తాల పేరుతో సొసైట...