భారతదేశం, మే 20 -- ముంబైలో అత్యంత పాశవిక, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. తన 19ఏళ్ల బాయ్​ఫ్రెండ్​, కూతురిని రేప్​ చేస్తుండగా ఆమె తల్లి చూస్తూ కూర్చుంది!

ముంబైలోని మాల్వానీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఓ 30ఏళ్ల మహిళకు రెండున్నరేళ్ల కూతురు ఉంది. అంతేకాదు, ఆ మహిళ 19ఏళ్ల యువకుడితో ప్రేమలో ఉంది.

ఆదివారం రాత్రి తల్లి, ఆమె ప్రియుడు చిన్నారిని మాల్వానీ జనకల్యాణ్ నగర్​లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన బిడ్డకు మూర్చ వచ్చిందని, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఆపేసిందని ఆ తల్లి చెప్పింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్​పై తీవ్ర గాయాలున్నాయని తేలింది. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించ...