భారతదేశం, ఫిబ్రవరి 24 -- భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 24) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ షేర్లలో కొనసాగుతున్న భారీ అమ్మకాలతో దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. క్రితం సెషన్‌లో వచ్చిన లాభాలన్నీ ఒక్కరోజే తుడిచిపెట్టుకుపోయాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు (1.28%) నష్టపోయి 82,225.92 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 50 కూడా 276.35 పాయింట్లు (1.07%) క్షీణించి 25,436.65 వద్ద నిలిచింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బిఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ Rs.469 లక్షల కోట్ల నుంచి Rs.466 లక్షల కోట్లకు పడిపోయింది.

మార్కెట్లను కుదిపేసిన 3 ప్రధాన అంశాలు:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త ...