భారతదేశం, జనవరి 26 -- కాంగ్రెస్, బీజేపీ రాజ్యాంగాన్ని పదే పదే అణగదొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు . రాజ్యాంగ ఉల్లంఘనలకు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ సమానంగా బాధ్యత వహించాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ సమావేశంలో రాహుల్ గాంధీ విడుదల చేసిన న్యాయ పత్రం.. అన్యాయపు పత్రంగా మారిందని విమర్శించారు.

'కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకుంటున్నారు. ఆయన ఒకప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో రాజ్యాంగ నిబంధనలు క్రమంగా దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజాస్వామ్య విలువలు క్షీణి...