భారతదేశం, ఫిబ్రవరి 19 -- ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రమదాన్ (రంజాన్) మాసం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలవంక (హిలాల్) దర్శనమివ్వడంతో ఆయా దేశాల్లో ఉపవాస దీక్షల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. భక్తిశ్రద్ధలు, ప్రార్థనలు, దానధర్మాలకు నిలయమైన ఈ పవిత్ర మాసం కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు భారత్లోని ముస్లింలు కూడా సిద్ధమయ్యారు.
సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఫిబ్రవరి 17 (మంగళవారం) సాయంత్రమే నెలవంక కనిపించడంతో, అక్కడ ఫిబ్రవరి 18 (బుధవారం) నుంచే పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైంది. ఖతార్ కూడా బుధవారం నుంచే రంజాన్ మొదటి రోజుగా అధికారికంగా ప్రకటించింది.
భారతదేశంలో ఫిబ్రవరి 18 (బుధవారం) సాయంత్రం 6:15 నుండి 6:45 గంటల మధ్య నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఇక్కడ ఫిబ్రవరి 19 (గురువారం) నుంచి పవిత్ర ఉపవాస దీక్షలు (రోజా) ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.