భారతదేశం, ఆగస్టు 1 -- న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన నిరసన ర్యాలీ కేసులో వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయడానికి నిరాకరించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మోహన్ బాబు, ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం అనుమతించింది.
2019 మార్చి 22న మోహన్ బాబు, ఆయన కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు చెందిన ఇద్దరు సీనియర్ సిబ్బంది కలిసి ఒక న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.