భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా మైనారిటీలు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం పొందవచ్చు.
మైనారిటీల స్వయం ఉపాధి రుణాలు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.173.57 కోట్లు కేటాయించింది. ఈ నిధులను మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందించనున్నారు.
ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, కార్పెంటరీ వంటి వాటిలో నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.