భారతదేశం, మే 26 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 769 పాయింట్లు పెరిగి 81,721 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 243 పాయింట్లు వృద్ధిచెంది 24,853 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 55,398 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,794.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 299.78 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"బెంచ్ మార్క్ నిఫ్టీ50 ఇండెక్స్​కి 24600, 24450 స్వల్ప కాలానికి కీలక మద్దతు జోన్లు కాగా, 25000 రెసిస్టెన్స్​ జోన్​గా ఉంటుంది. 25000 పైన విజయ...