భారతదేశం, ఫిబ్రవరి 10 -- మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 11న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు కూడా సెలవు ఉంటుంది. ఓటర్ల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్లు తమ తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో సెలవు దినాన్ని అమలు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రాంతాల్లో పనిచేసే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థలు, స్థానిక సంస్థలు పోలింగ్ రోజున మూసివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో సహా విద్యాసంస్థలు కూడా మూసివేస్తారు. ఎందుకంటే ఈ భవనాలలో అనేకం పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను ము...