భారతదేశం, మే 12 -- మున్నేరు బాధితులందరికి రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది అకాల వర్షాలతో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్రంగా బాధపడ్డ విషయాన్ని గుర్తు చేశారు.

వరదల సమయంలో మున్నేరు బాధితులను పరామర్శించి తక్షణ సహాయం అందించామని మంత్రి చెప్పారు. అదే స్పూర్తితో ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని వివరించారు. ఈ ప్రాంతాల్లో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదల భద్రత కోసమే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు.

"రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వారికీ భరోసా కలుగుతుంది. ఎవరికీ అన్యాయం కాకుండా, అందరికీ రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కల్పిస...