భారతదేశం, ఫిబ్రవరి 16 -- మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. సద్గురు సమక్షంలో జరిగిన ఈ భారీ ఆధ్యాత్మిక ఉత్సవానికి వెండితెర తారలు తరలివచ్చారు. భక్తి, సంస్కృతి మేళవింపుగా సాగిన ఈ వేడుకల్లో తమన్నా భాటియా, సారా అర్జున్, శ్రీనిధి శెట్టి, మౌనీ రాయ్ వంటి హీరోయిన్స్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

శివనామ స్మరణ, సంగీత విభావరితో మార్మోగిన ఆ రాత్రి.. స్టార్ హీరోయిన్ తమన్నా, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి, ధురంధర్ భామ సారా అర్జున్ డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉత్సాహంగా చిందులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మిక శక్తిని ఆస్వాదిస్తూ, ఎంతో వినమ్రంగా వారు డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఒక వీడియోలో 'ధురంధర్' స్టా...